Search This Blog

591. Kataaksha kinkaribhoota kamalakotisevitha

లలితమ్మ యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఎవరియందుంటాయో వారిని కోటిమంది లక్ష్మీదేవులు సేవిస్తుంటారు. మనందరం ఆవిడ బిడ్డలేమే. అందుకే ఆవిడ మనపై అవ్యాజమైన కరుణ చూపిస్తుంది. కేవలం మనం కోరుకున్నది ఇచ్చినంతటితో ఆవిడ మనసు తీరదు. అందుకే మనం కోరిన దానికన్న కొన్ని రెట్లు ఎక్కువ ఇస్తుంది.

ఆవిడ కరుణ ఉన్నంతమాత్రంచేత లక్ష్మీ అనే పేరుగల దేవతలు అనేకమంది మనకు సేవకులవుతారు. మనం చేయవలసినది పరిపూర్ణ భక్తి తో, ప్రీతితో, నమ్మకంతో అమ్మను అడగటమే. పిల్లలు అడిగింది ఇవ్వడంలోనే అమ్మకు తృప్తి కదా. మరి ఆవిడ మనం అడిగింది ఎందుకు ఇవ్వదు? ఆవిడ మాతృ స్వభావం అటువంటిది.

ఆవిడ సాధారణమైన స్త్రీకాదు. ఓడ్యాణ పీఠంలో బిందుమండలమందుంటుంది. ఆవిడని ప్రతి ఆవరణలోను 64 కోట్లమంది యోగినీ దేవతలు సేవిస్తుంటారు. మొత్తంమీద 64 x 9 = 576 కోట్లమంది యోగినీగణం ఆమెను నిత్యంసేవిస్తుంటారు. ఆవిడని ప్రార్ధించినవారికి ఈ యోగినీ దేవతలు కోరికలు తీరుస్తుంటారు. మన అమ్మ అంత గొప్పది అయినప్పుడు మనకు ఇంక దయనీయమైన స్థితి ఎందుకు ఉంటుంది.

Crores of Lakshmi devi's serve those who are blessed by Divine mother. She is maha rajni. She is ruling from Odyana peetha. A total of 576 crore yogini ganas are at her service always.

As children, we are always eligible of her unconditional love. She is always busy fulfilling all our wishes. Of course this is what motherhood is about. We just have to ask her with love and faith. That's all.

All devatas with names as Lakshmi are at service of those who are blessed by Divine mother.

Popular